ఒసామా బిన్ లాడెన్నీ హతం చేసే ఆపరేషన్ లో భారత్ పాత్ర

      బిన్ లాడెన్నీ హతం చేసే ఆపరేషన్ కి రూపకర్త మరియు సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ, యూస్ సెక్రటరీ అఫ్ డిఫెన్స్ గా పనిచేసిన "లియోన్ పెనెట్టా" wion channel కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో లాడెన్ ని హతం చేసే ఆపరేషన్ లో భారత్ పాత్ర గురించి పంచుకున్నారు.

    ఆ ఆపరేషన్ గురించి మరిన్ని విష్యాల్ని పంచుకుంటూ లాడెన్నీ గుర్తించిన భవనం ఉన్న అబోటాబాడ్ లో పాకిస్తాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయని అలాంటి చోట బిన్ లాడెన్ ఉన్నాడని పాకిస్థాన్లో ఎవరికి తెలియదనడం నమ్మశక్యంగా లేదని అన్నారు. తాము లాడెన్ భవనాన్ని కనుకున్నపుడు ఆ విష్యాన్ని పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలియ చేయాలా వద్దా అనే విష్యం గురించి ఆలోచించామని, అయితే గతంలో ఉగ్రవాదుల గురించి పాకిస్తాన్ కి తెలియ చేసినప్పుడు వాళ్లు తప్పించుకోవడం జరిగింది అని అందువల్ల Pakistani ల మీద నమ్మకం లేకపొవడం వల్ల ప్రెసిడెంట్ ఒబామా తెలియ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నటుగా చెప్పారు. అలాగే తాము చేయబోయే ఆపరేషన్ గురించి కూడా పాకిస్తాన్ కి తెలియ చేయకూడదని నిర్ణయించుకున్నామని, అలా చేయడం వల్లే తమ ఆపరేషన్ సక్సెస్ అయింది అని భావిస్తున్నామని చెప్పారు. ఒకవేళ పాకిస్తాన్ కి తెలియచేసినట్టయితే బిన్ లాడెన్ కి ఆ సమాచారం అందేదని అతను తప్పించుకునేవాడని చెప్పారు. 

   అదే విధంగా లాడెన్నీ హతం చేసే ఆపరేషన్ లో భారత్ సహకారం గురించి తెలియ చేస్తూ, ఒక వేళ లాడెన్ దొరికితే పాకిస్తాన్ లేదా మరేదన్న దేశం లో పూడ్చి పెట్టాలంటే అక్కడ ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని, అందువల్ల లాడెన్ సేవాణ్ని ఇండియన్ ఓషన్ లో జారవిడవాలని నిర్ణయించుకున్నటు చెప్పారు. అదే విష్యాన్ని భారత ప్రభుత్వానికి తెలియచేశామని. దానికి భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందచేశారని చెప్పారు. 

    

Comments

Post a Comment

Popular posts from this blog

ఒక్క సర్వే తో వందల ఉద్యోగాలు హుష్ కాకి.. కానీ చివరికి ఒక ట్విస్ట్

పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఫార్మ్ హౌస్ లోనే ఎందుకు ఉంటారు